రూ.1.08 కోట్ల చెక్కు అందజేసిన ఫౌండర్ వరప్రసాద్రెడ్డి
యాదాద్రి, మార్చి 8 : యాదాద్రీశుడిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులకు నిత్యాన్నదానం నిర్వహణకు హైదరాబాద్కు చెందిన శాంత బయోటెక్ ఫౌండర్ డాక్టర్ వరప్రసాద్రెడ్డి రూ.1.08 కోట్ల విరాళం సమర్పించారు. మంగళవారం స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆయన విరాళానికి సంబంధించిన చెక్కును ఆలయ ఈవో ఎన్ గీతకు అందజేశారు. ఈ సందర్భంగా వరప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. ఎంతోమంది భక్తులు వివిధ రూపాల్లో ఆలయానికి విరాళాలు అందజేస్తున్నారని, తాను భక్తుల అన్నదానం కోసం ఇవ్వాలని సంకల్పించినట్టు చెప్పారు.
విమానగోపురం స్వర్ణతాపడానికి 51 వేల విరాళం
యాదాద్రి ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి యాదగిరిగుట్టకు చెందిన సౌభాగ్య రిసార్ట్స్ అధినేత వెంకటేశ్వర్లు రూ.51 వేల విరాళం సమర్పించారు.