హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార ఖర్చు కోసం అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ రూ.లక్షను అందజేశారు. శనివారం హైదరాబాద్లో మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుకు చెక్కు ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఈసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శంకరమ్మను మరింత గౌరవప్రదమైన స్థానంలో నిలిపే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరుల ఆశయాల సాధన కోసం బీఆర్ఎస్ మరోసారి గెలవాల్సిన అవసరం ఉన్నదని శంకరమ్మ చెప్పారు.