హైదరాబాద్ : స్వరశిఖరం.. భారత బాలీవుడ్ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ తన గానంతో తుపాను సృష్టించారు. ఎల్బీ స్టేడియంలో కొనసాగుతున్న స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో శంకర్ మహాదేవన్ తన గాత్రంతో అందర్నీ మైమరిపించారు. గణనాయకాయ పాటతో తన కార్యక్రమాన్ని శంకర్ మహదేవన్ ప్రారంభించారు.
ఎవరి పేరు చెబితే యావత్ భారతం సముద్ర తరంగమై ఉప్పొంగుతుందో.. ఎవరి పేరు చెబితే ఒక అద్భుతమైన గానం మన హృదయాల్లో ఆవహిస్తుందో.. ఎవరి పేరు చెబితే యువకులు ఆశ్వాల్లాగా పరుగెడుతారో.. అటువంటి ఓ స్వర మాంత్రికుడు, స్వరగిరి శిఖరం, ముంబై దగ్గరుండే చెంబూరులో జన్మించి, ఐదో ఏట నుంచే సంగీతాన్ని అభ్యసించడం మొదలుపెట్టాడు. ఆయన కర్ణాటక సంగీతంలో విద్వాంసులు. హిందుస్తానీ సంగీతంలో విద్వాంసులు. పాశ్చాత్య సంగీత కళలన్నీ అవపోసన పట్టాడు. 1988లో బ్రీత్లెస్ సాంగ్ పాడి ఓ కొత్త ఒరవడిని సృష్టించాడు. అది ఒక మహోన్నతమైనటువంటి సంగీత తుపానుగా భారతాన్ని చుట్టుముట్టింది. ఆయనే శంకర్ మహదేవన్ అంటూ దేశపతి శ్రీనివాస్ సభకు పరిచయం చేశారు. ఆయన గానంతో అందర్ని మైమరిపించారు. పద్మశ్రీ పురస్కారాన్ని అందించింది కేంద్ర ప్రభుత్వం.