హైదరాబాద్ : రిస్క్ దేశాల నుంచి శనివారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 70 మంది ప్రయాణికులు వచ్చారు. అందరికీ విమానాశ్రయంలో కొవిడ్ నిర్ధారణ కోసం ఆర్టీ పీసీఆర్ పరీక్షలు చేయగా.. అందరికీ నెగెటివ్గా తేలింది. ప్రస్తుతం ప్రయాణికులందరినీ హోంక్వారంటైన్కు తరలించారు.
ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చిన 13 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. వారి నమూనాలను జీనోమ్ సీక్వెసింగ్ కోసం పంపిన అధికారులు.. రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు రిస్క్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి 979 మంది ప్రయాణికులు రాగా.. వారికి పరీక్షలు చేశారు. ఇందులో కేవలం 13 మంది వైరస్కు పాజిటివ్గా పరీక్షలు చేశారు.