షాద్నగర్, మే 24: షాద్నగర్కు చెందిన ఓ యువకుడు ఆస్టేలియా రాజధాని సిడ్నీలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకా రం.. రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చెందిన అరటి ఉషారాణి, కృష్ణ దంపతుల కుమారుడు అరవింద్(35) ఉద్యోగం కోసం పదేళ్ల క్రితం అస్టేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు. ఏడాదిన్నర క్రితం కేశంపేట మండలం చింతకుంటపల్లికి చెందిన సిరివెన్నెలను పెండ్లి చేసుకొని సిడ్నీకి తీసుకెళ్లాడు.
ఇటీవల అరవింద్ తల్లి ఉషారాణి సిడ్నీ వెళ్లి నాలుగు రోజుల క్రి తం షాద్నగర్కు తిరిగి వచ్చింది. అదేరోజు అరవింద్ కారును వాషింగ్ చేయిస్తా అని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. మూడు రోజులు గడిచినా ఇంటికి రాకపోవడంతో అరవింద్ భార్య, పోలీసులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం సముద్ర తీరంలో ఓ కారును గుర్తించారు. అనంతరం సమీపంలోనే ఓ మృతదేహాన్ని గుర్తించగా అరవింద్గా తేలింది.
పోలీసులు వివరాలను కుటుంబసభ్యులకు తెలిపారు. అరవింద్ తండ్రి కృష్ణ స్థానిక బీజేపీ నాయకుడు. ఆయన కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందాడు. అరవింద్ మృతిపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో మృతదేహాన్ని షాద్నగర్కు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని కిషన్రెడ్డి తెలిపారు.