హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలన్నింటికి పీఎస్ హెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) యూనియన్ విజ్ఞప్తి చేసింది. యూనియన్ నాయకులు శుక్రవారం అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. దీనిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పం దించినట్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్రెడ్డి తెలిపారు. క్రమబద్ధీకరణలో 1:20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను కేటాయించాలని, మిగిలిన 13 జిల్లాల్లోనూ స్పౌజ్ కేసులను అనుమతించాలని మంత్రిని కోరినట్టు వారు వెల్లడించారు.