హైదరాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ): మైనార్టీ యువతుల ఉపాధి కోసం మైనార్టీ కార్పొరేషన్ తరఫున ‘కేసీఆర్ కా తోఫా ఖవాతీన్ కే లియో భరోసా’ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు సంస్థ చైర్మన్ మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్ తెలిపారు. నాంపల్లిలోని మైనార్టీ సంక్షేమ భవన్లో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు యువతులకు కుట్టుమిషన్లు, సబ్సిడీ రుణాల చెక్కులను పంపిణీ చేశారు. అర్హులైన వారి జాబితాను రూపొందించి తమకు పంపించాలని జిల్లా అధికారులను ఇంతియాజ్ ఆదేశించారు. కార్యక్రమంలో సంస్థ ఎండీ కాంతి వెస్లీ ఇతర అధికారులు పాల్గొన్నారు.