హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం తుఫానుగా మారే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది.
దీంతో ఆ జిల్లా అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించింది. గురువారం నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ముందుజాగ్రత్తగా చిత్తూరు కలెక్టరేట్లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది.