సిద్దిపేట : గ్యాస్ బండి(Gas van)ని ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీ కొట్టడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ములుగు ఉద్యాన వర్సిటీ(Mulugu Horticultural University) వద్ద రోడ్డు మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గ్యాస్ సిలిండర్ల లోడ్తో వెళ్తున్న వాహనాన్ని ఉద్యాన వర్సిటీ వద్ద ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను లక్ష్మక్కపల్లి ఆర్వీఎం దవాఖానలో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం మరో బస్సులో ప్రయాణికులను తరలించారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.