హైదరాబాద్, ఏప్రిల్20 (నమస్తే తెలంగాణ): గురుకుల పోస్టులను డీసెండింగ్ ఆర్డర్లో భర్తీ చేయాలని తెలంగాణ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) అధికారులకు అభ్యర్థులు విజ్ఞప్తి చేశా రు. పోస్టులేమీ మిగలకుండా నియామకాలను చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరా రు. శుక్రవారం ట్రిబ్ అధికారులను గురుకుల అభ్యర్థులు శివశంకర్గౌడ్, సైదులు, రాజు కలిసి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రతిని అందజేశారు.
గురుకులాల్లోని 9,210 టీచర్ పోస్టుల భర్తీకి ట్రిబ్ పరీక్షలు నిర్వహించి, ఫలితాలను విడుదల చేసిందని తెలిపారు. అయితే, డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ పోస్టులను డీసెండింగ్ ఆర్డర్లో నింపలేదని, ఫలితంగా ఎక్కువసంఖ్యలో బ్యాక్లాగ్లు మిగిలిపోతున్నాయని వెల్లడించారు. ఒకే కామన్ పేపర్స్ పెట్టి, రిక్రూట్మెంట్ను మాత్రం అసెండింగ్ ఆర్డర్లో భర్తీ చేయడం వల్ల ఒకే అభ్యర్థి ఒకటికి మించి ఎకువ ఉద్యోగాల్లో ఎంపికయ్యారని వివరించారు. ట్రిబ్ బోర్డు అనాలోచిత నిర్ణయం వ ల్ల అభ్యర్థులకు నష్టం వాటిల్లిందని వాపోయారు. ఈ విషయమై సీఎం , మంత్రులను కలిసి న్యాయం చేయాలని కోరినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల మేర కు ట్రిబ్ చర్యలు చేపట్టాలని కోరారు.