హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు పోలీస్శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. నాగర్ కర్నూల్ డీఎస్పీగా ఏసీపీ మోహన్ కుమార్ బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన రాచకొండ కమిషనరేట్లో పీడీ సెల్గా పని చేస్తున్నారు. నాగర్ కర్నూల్లో పని చేస్తున్న మోహన్రెడ్డిని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. అచ్చంపేట డీఎస్పీగా కృష్ణ కిశోర్, అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ మధుసూదన్ హనుమకొండ ట్రాఫిక్ ఏసీపీగా బదిలీ అయ్యారు.
హనుమకొండ ట్రాఫిక్ ఏసీపీ బాలస్వామి డీజీపీ కార్యాలయానికి ట్రాన్స్ఫర్ చేశారు. నిర్మల్ డీఎస్పీగా జీవన్రెడ్డి బదిలీ అవగా.. అక్కడ ఉన్న డీఎస్పీ ఉపేందర్రెడ్డిని డీజీపీ కార్యాలయానికి, ఎల్పీనగర్ ఏసీపీగా అంజయ్యను నియమించగా.. ప్రస్తుతం ఎల్పీనగర్ ఏసీపీగా పని చేస్తున్న శ్రీధర్రెడ్డిని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేస్తూ పోలీస్శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.