టీఈఈ 1104 యూనియన్ వినతి
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణకు కొత్త పీఆర్సీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ నేతలు మంగళవారం టీఎస్ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావుకు వినతిపత్రం సమర్పించారు. 2018 ఏప్రిల్ 1న కుదుర్చుకొన్న వేతన సవరణ ఒప్పందం గడువు వచ్చే ఏడాది మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో నూతన వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభాకర్రావును కలిసినవారిలో యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేమూరి వెంకటేశ్వర్లు, జీ సాయిబాబు, నాయకులు సీహెచ్ శంకర్, వరప్రసాద్, వేణు, తులసీరామ్, బాలకృష్ణ, రామచందర్ తదితరులు ఉన్నారు.