హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లోని బేగంపేట ప్రకాశ్నగర్లో ఉన్న వల్లభ్నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పంజాబ్కు చెం దిన 2004 బ్యాచ్ ఐఏఎస్ అధికారుల బృందం గురువారం సందర్శించింది. కార్యకలాపాలను గంటపాటు పరిశీలించిన పంజాబ్ రెవెన్యూ సెక్రటరీ ఎస్ హెచ్ మన్వేశ్ సింగ్ సిద్ధూ తో కూడిన ఐఏఎస్ల బృందం ప్రత్యేకంగా ప్రశంసించింది.
రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, లావాదేవీలను బృందం సభ్యులు పరిశీలించారు. సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఐఏఎస్ల బృందంతో రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ డీఐజీ సుభాషిణి, ఉన్నతాధికారి మోహన్ ఉన్నారు. ఐఏఎస్ల బృందానికి వల్లభ్నగర్ సబ్ రిజిస్ట్రార్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ కృతజ్ఞతలు తెలిపారు.