హైదరాబాద్, మే 31, (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బుధవారం కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆర్టీఏ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి. రవాణాశాఖ సెకండ్ వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్వర్లో తలెత్తిన ఈ సమస్యతో ఆర్టీఏ వెబ్సైట్లో వాహనాల వివరాలు కనిపించక వాహనదారులు ఆందోళన చెందారు. మధ్యాహ్నం 3 గంటల వరకు కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. సర్వర్లో తలెత్తిన సాంకేతిక సమస్యను ఆర్టీఏ ఉన్నతాధికారులు గుర్తించి పరిష్కరించడంతో ఆ తర్వాత 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను చేపట్టినట్టు జాయింట్ ట్రాన్స్పోర్టు కమిషనర్ రమేశ్ తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న వాహనదారుల వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాకుంటే మరో రెండు రోజుల పాటు అవకాశం కల్పించినట్టు తెలిపారు.