హైదరాబాద్ : పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు నేతృత్వంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సెర్ప్ ఉద్యోగులు పాలాభిషేకం నిర్వహించారు. సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ ప్రకటించనున్నట్లు బడ్జెట్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రిని హైదరాబాద్లోని నివాసులో సెర్ప్ ఉద్యోగుల జేసీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రిని శాలువాతో సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తామని 2018లో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు.. బడ్జెట్లో చేసిన ప్రకటన చేసినందుకు ఉద్యోగుల తరఫున సీఎం కేసీఆర్కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వాలు ఉద్యోగులను వాడుకున్నాయే తప్పా.. వారిని ఏనాడూ పట్టించుకోలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగుల డిమాండ్ నెరవేరబోతున్నదన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్తో పాటు మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు తెలిపారు.
ఉద్యోగులకు పే స్కేల్ అమలుతో ప్రభుత్వంపై రూ.58కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ఈ ఏడాది నుంచి పే స్కేల్ అమలులోకి రానున్నదన్నారు. ఇందు కోసం బడ్జెట్ను రూ.176కోట్ల నుంచి రూ.234కోట్లకు పెంచడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల జేసీ నేతలు గంగాధర్రెడ్డి, నర్సయ్య, సుభాష్, జానయ్య, సురేఖ, వెంకట్, గిరి, మధు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి సమూలంగా పేదరిక నిర్మూలన చేసేందుకు కృషి చేస్తామని ఉద్యోగులు పేర్కొన్నారు.