Actor Chandu | మణికొండ, మే17: బుల్లితెర నటుడు చం దు (చంద్రకాంత్) ఆత్మహత్యకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి ఠాణా పరిధిలోని అల్కాపూర్ కాలనీలో శుక్రవారం ఆయన తన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చందు త్రినయని, రాధమ్మ పెళ్లి, కార్తీకదీపం వంటి సీరియల్స్లో నటించారు. చందు 2015లో శిల్ప అనే యువతిని ప్రేమ వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృ తి చెందిన మరో టీవీ సీరియల్ నటి పవిత్ర జయరాంతో చందూ ఆరేండ్లుగా సహజీవనం చేస్తున్నట్టు చెప్తున్నారు. కర్ణాటకకు చెందిన వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోవాలని అనుకున్నారు. గత వారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి చెందింది. ఆమెతోపాటు ఉన్న చందూ గాయాలతో బయటపడ్డాడు. రెండు రోజుల క్రితం పవిత్ర పుట్టినరోజు సందర్భంగా ‘ఆమె నన్ను పిలుస్తున్నది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇంతలోనే బలవన్మరణానికి పాల్పడ్డారు.