హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ర్యాగింగ్ (Ragging) కలకలం సృష్టించింది. జూనియర్లను హాస్టల్కు పిలిపించిన సీనియర్లు.. ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలు చేశారు. దీంతో బాధితులు ప్రిన్సిపల్ నేతృత్వంలోని యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఆధారలతో సహా ఫిర్యాదు చేశారు. ఆధారాలను పరిశీలించిన అధికారులు.. 20 మంది సీనియర్లపై చర్యలు తీసుకున్నారు. వారిలో 13 మందిని కాలేజీ, హాస్టల్ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. మరో ఏడుగురిని ఒక సెమిస్టర్ నుంచి రస్టిగేట్ చేశారు.
కాగా, ర్యాగింగ్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇన్చార్జి వీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ల హాస్టల్లోకి సీనియర్లు వెళ్తే కేర్ టేకర్లను బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. ఫిర్యాదుపై యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ వెంటనే స్పందించాలన్నారు. రస్టిగేట్ అయినవారిలో.. ఉప్పు పవన్, అర్తం గణేశ్, సురేష్, కార్తీక్, నాగరాకేశ్ రెడ్డి, వెంకట గౌతమ్ కృష్ణ, వికాస్ ఉన్నారు.