దేవరుప్పుల/కొత్తగూడెం ప్రగతి మైదాన్, మార్చి 31: ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లా భైరాంఘర్ పరిధిలోని బాజీపూర్ బార్డర్ నెల్గోడా వద్ద సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన మావోయిస్టు గుమ్మడవెల్లి రేణుక అలియాస్ భాను అలియాస్ చైతీ అలియాస్ సరస్వతి మృతి చెందింది. ఈమెపై తెలంగాణ ప్రభుత్వం రూ.20 లక్షలు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. కడవెండికి చెందిన గుమ్మడవెల్లి సోమయ్య- జయమ్మ దంపతుల కూతురు రేణుక. అన్న గుమ్మడవెల్లి వెంకటకృష్ణప్రసాద్ (జీవీకే ప్రసాద్) మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా పనిచేసి లొంగిపోయారు. 1996లో ఆమె మావో యిస్టు పార్టీలో చేరారు. అలిపిరిలో చంద్రబాబు బాంబ్ బ్లాస్ట్ ఘటన అనంతరం నిర్బంధం పెరగడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లింది. రేణుక 2005లో సెంట్రల్ కమిటీ సభ్యుడు శాఖమూరి అప్పారావును వివాహమాడిందని, అతను 2010లో నల్లమలలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందినట్టు ఐజీ వెల్లడించారు. రేణుక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె అంత్యక్రియలు కడవెండిలోనే చేసేందుకు కుటుంబ సభ్యు లు మొగ్గు చూపారని తెలిసింది.