హైదరాబాద్, మార్చి 21, (నమస్తే తెలంగాణ): సీనియర్ జర్నలిస్ట్ జీ వల్లీశ్వర్ నేషనల్ బుక్ ట్రస్టు ఎగ్జిక్యూటీవ్ కమిటీలో సభ్యుడిగా, సంస్థ ట్రస్టీగా నియమితులయ్యారు. ఈ మేరకు నేషనల్ బుక్ ట్రస్ట్ డైరెక్టర్ యువరాజ్ మాలిక్ గురువారం ఉత్తర్వులిచ్చారు.
మూడేండ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. సీనియర్ జర్నలిస్ట్ అయిన వల్లీశ్వర్ ఆంధ్రపత్రిక, ఈనాడు, న్యూస్టైమ్ పత్రికల్లో, భారత్ టుడే చానల్ల్లో ఉన్నతస్థాయిలో పనిచేసి, నాటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి వద్ద చీఫ్ పీఆర్వోగా, ఆంధ్రప్రదేశ్ పత్రిక ఎడిటర్గా సేవలందించారు. ప్రస్తుతం ఎమెస్కో ప్రచురణ సంస్థలో కీలక బాధ్యతల్లో ఉన్నారు.