హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : నకిలీ, మిస్ బ్రాండెడ్, గడువు ముగిసిన పురుగుమందుల విక్రయాన్ని సాధారణ నేరంగా పరిగణించలేమని హైకోర్టు స్పష్టంచేసింది. నకిలీ పురుగుమందుల విక్రయం, నిల్వ, పంపిణీని అడ్డుకునేందుకు నిర్బంధ చట్టాన్ని వినియోగించడం సమర్థనీయమేనని తేల్చి చెప్పింది.
ముద్దంగుల ఆదిత్యను ‘ఇన్సెక్టిసైడ్ అఫెండర్’గా పేరొంటూ 2025 సెప్టెంబర్ 8న జారీ చేసిన నిర్బంధ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన భార్య ఏర్లం అలియాస్ ముద్దంగుల అనురాధ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ మౌషుమీ భట్టాచార్య, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం కొట్టివేసింది. ఆదిత్య ఉత్తరప్రదేశ్ నుంచి తకువ ధరకు నకిలీ పురుగుమందులు తెప్పించి, వివిధ కంపెనీల పేర్లతో నకిలీ ఉత్పత్తులు తయారు చేసి ఏజెంట్ల ద్వారా రైతులకు విక్రయించినట్టు ఆరోపణలు ఉన్నాయని కోర్టు పేరొన్నది.