హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్య విధాన పరిషత్లో ఏఎన్ఎం/ఎంపీహెచ్ఏ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో ఉంచినట్టు టీఎస్పీఎస్ బుధవారం వెల్లడించింది.
ఈ ఏడాది జూన్ 28న ఇచ్చిన నోటిఫికేషన్కు అనుగుణంగా ఈ జాబితాను వెల్లడించినట్టు తెలిపింది. జూన్ 30 నుంచి జూలై 2 వరకు అభ్యర్థులెవరూ రీలిక్విష్మెంట్ ఇవ్వని కారణంగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగింపులో భాగంగా తాజాగా అభ్యర్థుల ఎంపిక జాబితాను www.tspsc.gov.in లో పెట్టినట్టు కమిషన్ పేర్కొన్నది.