అశ్వారావుపేట, మే 10 : కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.4.5 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీసులు పట్టుకున్నారు. అశ్వారావుపేట సీఐ బంధం ఉపేందర్రావు మంగళవారం స్థానిక పోలీస్స్టేషన్లో మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
సోమవారం రాత్రి ఛత్తీస్గఢ్ రాష్ట్రం కుంట నుంచి కారులో గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు అశ్వారావుపేట ఎస్సై చల్ల అరుణ తన సిబ్బందితో మండలంలోని ఆసుపాక గ్రామ శివారులో మాటు వేసి పట్టుకున్నారు. కారును స్వాధీనం చేసుకుని, నిందితులు ములకలపల్లికి చెందిన అంబుల్లి వీరాచారి, జగన్నాథపురానికి చెందిన గజ్జల అవినాష్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు.