హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. మంగళవారం కస్టమ్స్ అధికారులు ముగ్గురు మహిళల నుంచి 1481.10 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేసింది. పట్టుకున్న బంగారం విలువ రూ.72.80లక్షల విలువ ఉంటుందని పేర్కొంది. దుబాయి నుంచి 6E 8422 ఫ్లైట్ ద్వారా వచ్చిన ఓ మహిళ పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని లోదుస్తుల్లో దాచి తరలిస్తుండగా.. రూ.48.71లక్షల విలువైన 991 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దుబాయి నుంచి కువైట్ మీదుగా వచ్చిన J9-1403 విమానంలో వచ్చిన ఓ మహిళ పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని పురీషనాళం దాచి తరలించింది. సదరు మహిళను గుర్తించి ఆమె వద్ద నుంచి రూ.8.28 లక్షల విలువైన 168.5 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి 6E 8422 నంబరు గల విమానంలో వచ్చిన మరో మహిళ బంగారాన్ని తరలిస్తుండగా రూ.15.81లక్షల విలువైన 321.60 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేశారు.