హైదరాబాద్: అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడటంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేషన్ల వద్ద భారీగా బలగాలను మోహరించారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో భారీగా బలగాలను మోహరించారు. స్టేషన్లోకి ఎవరినీ అనుమంతించడం లేదు. అదేవిధంగా వరంగల్, నిజామాబాద్, డోర్నకల్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్లలో బందోబస్తు పెంచారు. వరంగల్, ఖాజీపేట రైల్వే స్టేషన్లలో భాద్రతా ఏర్పాట్లను సీపీ తరుణ్ జోషి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
సికింద్రాబాద్ స్టేషన్లో నిర్వహించిన ఆందోళనలతో దాదాపు రూ.20 కోట్ల మేర నష్టం జరిగిందని సౌత్సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ తెలిపారు. అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, అగ్నిపథ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యువత పెద్దఎత్తున ఆందోళన చేస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అన్ని రైల్వే స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించింది.