హైదరాబాద్: సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రద్దయింది. రేక్ల సమస్య వల్ల రైలును క్యాన్సల్ చేసినట్లు అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు వందేభారత్ రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి విశాఖకు బయల్దేరాల్సి ఉంది. కాగా, ప్రత్యామ్నాయంగా ప్రయాణికుల కోసం అధికారులు ప్రత్యేక రైలును (08134A) ఏర్పాటు చేశారు. ఇది మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుందని, రాత్రి 11.30 గంటలకు విశాఖకు చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.
ఈ ట్రైన్కు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో హాల్టింగ్ ఉంది. వరంగల్, ఖమ్మంలో ఒక్క నిమిషం.. రాజమండ్రి, సామర్లకోటలో రెండు నిమిషాలు.. విజయవాడ స్టేషన్లో ఐదు నిమిషాలు ఈ రైలు ఆగుతుంది. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు. కాగా, ప్రయాణానికి ముందు రైలు రద్దయినట్లు ప్రకటించడం సరైనది కాదని ప్రయాణికులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.
*Please Note*
Cancellation of Tr. No:20834 Secunderabad-Visakhapatnam Vande Bharat Exp today 08.03.24 due to want of rakeRunning of Spl Train No: 08134A Secunderabad to Visakhapatnam today 08.03.24 departing Secunderabad at 15.00 hrs & arrive Visakhapatnam at 23.30 hrs same day
— South Central Railway (@SCRailwayIndia) March 8, 2024