హైదరాబాద్: సికింద్రాబాద్ క్లబ్ మూతపడింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదంలో క్లబ్ పూర్తిగా దగ్ధమయింది. ఈ నేపథ్యంలో క్లబ్ను మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు క్లబ్ ఇది అమలులో ఉంటుందని తెలిపింది.
అగ్నిప్రమాదంతో చాలావరకు నష్టపోయామని, క్లబ్కు భారీగా ఆస్తినష్టం జరిగిందని వెల్లడించింది.
అయితే క్లబ్ సభ్యులకు సంబంధించిన డాటా సురక్షితంగా ఉందని తెలిపారు. క్లబ్లోని కొల్నాడబార్, బిలియర్డ్స్ రూం, బాల్రూం, మెయిన్ రిసిప్షన్ నుంచి మొదటి అంతస్తుకు వెళ్లే చెక్కమెట్లు పూర్తిగా ధ్వసమయ్యాయని చెప్పారు. మెయిన్ హాల్ పూర్తిగా అగ్నికి ఆహుతైందని వెల్లడించారు.
సుమారు 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్లబ్కు 142 ఏండ్ల ఘనమైన చరిత్ర ఉన్నది. 1878 ఏప్రిల్ 26న మూడో నిజాం సికిందర్జా బ్రిటిష్ ఆర్మీ ఉద్యోగి గారిసన్ పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. భారత సాయుధ దళాలకు జనరల్ చౌదరి కమాండర్గా ఉన్నప్పుడు ఈ క్లబ్ను భారతీయుల చేతుల్లోకి వచ్చింది. 1903లో దీని పేరును సికింద్రాబాద్ క్లబ్గా మార్చారు. 1948లో తొలిసారి క్లబ్ అధ్యక్షుడిగా మీర్జా నజాప్ అలీఖాన్ను ఎన్నుకున్నారు. క్లబ్లో ప్రస్తుతం ఐదు వేల మంది సభ్యులు ఉన్నారు. దీనిని వారసత్వ సంపదగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రత్యేక తపాలా కవర్ విడుదల చేసింది.