హైదరాబాద్ : సికింద్రాబాద్ కంట్మోనెంట్ భారత్ రాష్ట్ర సమితి శాసనసభ సభ్యుడు జీ సాయన్న (72) ఆదివారం కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆయన గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. షుగర్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు సాయన్నను యశోద ఆసుపత్రికి తరలించారు. 16న సాయన్న అస్వస్థతకు గురవగా. . చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1951 మార్చి 5న సాయన్న చిక్కడపల్లిలో జన్మనించారు. 1981లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (బీఎస్సీ), 1984లో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నుంచి రాజకీయ ప్రవేశం చేశారు.
1994 నుంచి 2009 వరకు మూడుసార్లు కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ విజయం సాధించారు. 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియామకమయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 37,568 ఓట్ల మెజారిటీ గెలుపొందారు. సాయన్నకు భార్య గీత, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు.