RS Praveen Kumar | డీజీపీ సీవీ ఆనంద్ ఒక సెంచరీ కొట్టినందుకు చాలా సంతోషం.. రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలు అమలు చేయడంలో కూడా డీజీపీ డబుల్ సెంచరీ కొట్టేలాగా ఉన్నారని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 3వ తారీఖున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మిర్యాలగూడలో రైతు సదస్సు పెట్టాలని నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లమోతు భాస్కర్ రావు దరఖాస్తు చేస్తే వెంటనే డీఎస్పీ వెంటనే అనుమతి తిరస్కరించింన్నారు.
మీరు గతంలో సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన యువ సంగ్రామ సదస్సులో ట్రాఫిక్గా అంతరాయం కలగకుండా చూసుకుంటాము అని చెప్పిన తర్వాత కూడా మేమే వాలంటీర్లను పెట్టుకుని ట్రాఫిక్ను మేమే మేనేజ్ చేసుకుంటామని చెప్పాం.. గత నెలలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు కోసం పర్మిషన్ నిరాకరిస్తే హైకోర్టుకి వెళ్లి అనుమతి తెచ్చుకున్నాం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో, పండగల ఊరేగింపు సమయంలో పెట్టాల్సిన సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ పెడుతారు. అలాంటి సెక్షన్ 30 కేటీఆర్ రైతు సదస్సు మీద ఏ బేసిస్ మీద పెడుతారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
ఈ రాష్ట్రంలో డిసెంబర్ 7, 2023 నుండి అప్రకటిత కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మొన్న కూడా హరీశ్ రావు పాలిటెక్నిక్ విద్యార్థులతో మాట్లాడుతాను అంటే హౌస్ అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. మా నాయకులను పెళ్లికి, ఆసుపత్రికి, చివరికి చావుల దగ్గరికి కూడా పోనివడం లేదని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి అక్రమ ఆదేశాలు అమలు చేయడంలో కూడా డీజీపీ గారు సెంచరీ కొట్టేలాగా ఉన్నారు
లేకపోతే మిర్యాలగూడలో కేటీఆర్ హాజరవుతున్న రైతు సదస్సు కోసం మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు అప్లై చేస్తే డీఎస్పీ పర్మిషన్ రిజెక్ట్ చేశారు
గత నెలలో కూడా బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు కోసం పర్మిషన్… https://t.co/zRX8IPSZSw pic.twitter.com/t14epSxoka
— Telugu Scribe (@TeluguScribe) September 1, 2026
Tirumala | సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
New York: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో కత్తులతో మహిళ దాడి.. వీడియో
Biceps | పెద్ద బైసెప్స్ కావాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవే.. ఇలా చేయండి..