నిజామాబాద్ : జిల్లాలోని బోధన్ పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతున్నది. అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనేవారకు144 సెక్షన్ కొనసాగనున్నది. సున్నిత ప్రాంతాలలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వివాదానికి కారణమైన విగ్రహం చుట్టూ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విగ్రహం చుట్టూ ప్రత్యేక పికెట్, బారికేడ్లతో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. విగ్రహానికి 300 మీటర్ల వరకు పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు. ప్రత్యేక పోలీసు బలగాలతో పహారా కాస్తున్నారు.