హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 8, 9 తేదీల్లో రెండో బర్డ్వాక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. 60 మంది సభ్యులు నాలుగు బృందాలుగా ఏర్పడి జిల్లాలోని కాగజ్నగర్, పెంచికల్ పేట, బెజ్జూరు, సిర్పూర్ రేంజ్లో క్షేత్రస్థాయి బర్డ్వాక్ చేస్తారని పేర్కొన్నారు. ఈ వాక్లో అటవీ ప్రాంతంలో కనిపించే పక్షులను తమ కెమెరాల్లో బంధించనున్నారు. బర్డ్వాక్ ముగిసిన తర్వాత ప్రతినిధులకు అటవీశాఖ సర్టిఫికెట్లు అందజేయనున్నది. ఆసక్తిగలవారు ఎస్ఎల్ఆర్ కెమెరాలతోపాటు స్వెట్టర్లు, దుప్పటి వెంట తెచ్చుకోవాలని, ఆహారం, వసతి, రవాణా కోసం రూ.1500 చెల్లించాలని అటవీశాఖ అధికారులు సూచించారు.