హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) /బంజారాహిల్స్/ శేరిలింగంపల్లి/హాజీపూర్: ఎన్నికల నేపథ్యం లో రాష్ట్రవ్యాప్తంగా అధికారుల తనిఖీలు విస్తృతంగా కొనసాగు తున్నాయి. మంగళ వారం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజాగూడ చెక్పోస్ట్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఇన్నోవాలో రూ.కోటి 60 లక్షల 80 వేల నగదు లభ్యమైం ది. ఇది జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థికి చెందిన నగదుగా పోలీసులు భావిస్తున్నారు. బంజారాహిల్స్లో మంగళవారం ఒక్కరోజే ఫ్లయింగ్ స్కాడ్ రూ.2,50,000 పట్టుకోగా.. ఇప్పటి వరకు మొత్తం రూ.4,73,22,470 నగదు సీజ్ చేశారు. పోలీస్ అథారిటీ ద్వారా రూ.12,78,24,588 నగదు స్వాధీనం చేసుకోగా, ఇప్పటి వరకు రూ.86,68, 89,427 నగదును సీజ్ చేసినట్టు ఎన్నికల అధికారి రోనాల్డ్రోస్ తెలిపారు.
మంచిర్యాల జిల్లా హాజీపూర్లోని కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు మాధవరపు వెంకట రమణారావు ఇంట్లో సోమవారం రాత్రి తనిఖీ చేసి రూ.55 లక్షలను పట్టుకున్నట్టు ఎఫ్ఎస్టీ టీం అధికారి రాజన్న తెలిపారు. కాంగ్రెస్ కామారెడ్డి పట్టణ నాయకుడు శ్రీనివాస్రెడ్డి రియల్ ఎస్టేట్ కార్యాలయంలో ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు స్థానిక పోలీసులతో కలిసి నిర్వహించిన తనిఖీల్లో రూ.60 లక్షల వరకు నగదు దొరికినట్టు సమాచారం. ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చింతల రాంచంద్రారెడ్డిని గెలిపించాలని ఓటర్లకు డ బ్బులు పంచుతున్న ఇద్దరు బీజేపీ కార్యకర్త లను ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఫిలింనగర్లోని దీన్దయాళ్నగర్కు చెందిన ఎర్రబోతు మోహన్రావు, గచ్చిబౌలికి చెందిన మాగాని రాజు సోమవారం రాత్రి బీజేపీ అభ్యర్థి చింతలకు ఓటేయాలని రూ.2 వేల చొప్పున ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులను రెడ్హ్యాం డెడ్గా పట్టుకున్నారు. వారి నుంచి రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.