హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): కేరళలోని శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం మరో ఏడు ప్రత్యేక రైళ్లను నడపాలని శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ నెల 18 నుంచి ఈ రైళ్లు అందుబాటులోకి వస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్-కొల్లం, కొల్లం – సికింద్రాబాద్, కాచిగూడ-కొల్లం, కొల్లం- కాచిగూడ, నాందేడ్-కొల్లం, కొల్లం-తిరుపతి, తిరుపతి- నాందేడ్ మధ్య ప్రయాణిస్తాయి.