SCR Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. హోళీ పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు 12 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. పండుగ నేపథ్యంలో రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కిస్తున్నట్లు పేర్కొంది. సికింద్రాబాద్-గోమతినగర్ (07219) రైలు ఈ నెల 20న నడుస్తుందని పేర్కొంది. ఈ రైలు సికింద్రాబాద్లో ఉదయం 10.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు గోమతినగర్ చేరుకుంటుందని తెలిపింది.
గోమతినగర్-సికింద్రాబాద్ (07220) రైలు 22న మధ్యాహ్నం 2.30గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది. 22న సికింద్రాబాద్-సంత్రగాచి (07223) స్పెషల్ ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఉదయం 7.05గంటలకు బయలుదేరి.. మరునాడు ఉదయం 10.30 గంటలకు సంత్రగాచి స్టేషన్కు చేరుతుంది. ఇక సంత్రగాచి-సికింద్రాబాద్ (07224) రైలు 23న మధ్యాహ్నం 12.20 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 2.45 గంటలకు చేరుకుంటుంది. ఈ నెల 25న సికింద్రాబాద్-షాలిమార్ (07225) రైలు ఉదయం 4.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజున 6.05 గంటలకు షాలిమార్ స్టేషన్లో ఉంటుంది.
26న షాలిమార్ – సికింద్రాబాద్ (07226) స్పెషల్ ట్రైన్ ఉదయం 10 గంటలకు బయలుదేరి.. మరునాడు మధ్యాహ్నం ఒంటిగంటకు సికింద్రాబాద్కు చేరుతుంది. ఇక కాచిగూడ-లాల్గఢ్ (07053) రైలు 16, 23న, 30న అందుబాటులో ఉంటుంది. ఆయా రోజుల్లో రైలు రాత్రి 9.30 గంటలకు బయలుదేరి రెండురోజుల ప్రయాణం అనంతరం గమ్యస్థానం చేరుతుంది. లాల్గఢ్-కాచిగూడ (07054) స్పెషల్ ట్రైన్ 19న, 26, ఏప్రిల్ 2వ తేదీల్లో నడుస్తుంది. ఈ రైలు తేదీల్లో రాత్రి 7.45గంటలకు బయలుదేరి.. రెండురోజుల తర్వాత కాచిగూడ స్టేషన్కు చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ఆయా రైళ్లను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.