హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఇంధన శాఖ, రాష్ట్ర రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అందజేసే అవార్డుల్లో దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏడు పురస్కారాలు దక్కించుకున్నది. తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఐదు, ఆంధ్రప్రదేశ్ పరిధిలో రెండు అ వార్డులు వచ్చాయి. ‘తెలంగాణ రాష్ట్ర ఇంధన పరిరక్షణ అవార్డులు-2023’ పేరిట ఇచ్చే ఈ అవార్డుల ప్రదానోత్సవం బుధవారం హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్-విశ్వేశ్వరయ్య భవన్లో నిర్వహించారు. 20 22-23 సంవత్సరంలో ప్రణాళికాబద్ధంగా, సమర్థంగా ఇంధన వినియోగం, విద్యుత్తు పరిరక్షణ, పరిశోధన, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సాహం వంటి కృషి ఫలితంగా తెలంగా ణ, ఏపీల్లో ఉన్న భవనాలు, స్టేషన్లకు ఈ అ వార్డులు అందించారు. అవార్డులు సాధించిన అధికారులు, సిబ్బందిని ఎస్సీఆర్ జీఎం అరుణ్కుమార్ జైన్ అభినందించారు.