హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ 1200 యూనిట్లు ఉన్నాయని, 30వేలకుపైగా విద్యార్థులు స్కౌటింగ్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్టు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ దానకిషోర్, సెక్రటరీ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్లు తెలిపారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్పై బుధవారం లోక్భవన్లో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా 2025-26లో వెయ్యి స్కూళ్లల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేశామని, వచ్చే విద్యాసంవత్సరంలో మరో వెయ్యి బడుల్లో యూనిట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.