నారాయణపేట : నారాయణపేట జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్ర పరిధిలోని కందుకూరు శివారులోని తేళ్ల దేవత ఆలయంలో మంగళవారం తేళ్ల పంచమిని జరుపుకొన్నారు.
భక్తులు గుట్టపై రాళ్ల కింద ఉన్న తేళ్లను చేతితో పట్టుకొని ఒంటిపై, ముఖంపై, నాలుకపై వేసుకొని విన్యాసాలు చేశారు.