హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తెలుసుకొనేందుకు ప్రస్తుత విధానంలో సూదితో గుచ్చటం తప్పనిసరి. దీనికి పరిష్కారం చూపారు హైదరాబాద్కు చెందిన ఇద్దరు ఔత్సాహికులు. వేలిముద్ర వేసినంత తేలికగా షుగర్ టెస్టు చేసే ఈజీలైఫ్ గ్లూకో మీటర్ను ఆవిష్కరించారు దువ్వూరు వర్షిత, విమల్కుమార్. వివా లైఫ్ ఇన్నోవేషన్స్ పేరుతో వీరు ఓ స్టార్టప్ను ప్రారంభించి దేశంలోనే తొలిసారి నాన్ ఇన్వాసివ్ గ్లూకోమీటర్ను తయారుచేశారు. ఈ పరికరంపై వేలిని ఉంచితే చాలు శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎంత ఉన్నాయో కచ్చితంగా చెప్పేస్తుంది. దీని ధరకూడా తక్కువేనని వర్షిత తెలిపారు.