హైదరాబాద్, నవంబర్ 6 ( నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటరు జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ శనివారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 7, 27, 28 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2022 జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండేవారు డిసెంబర్ 6 వరకు ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ను ఇప్పటికే ప్రకటించినప్పటికీ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో అక్కడ జాప్యమైంది.