హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ‘లక్ష్య’ పేరుతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ను రూపొందించింది. పరీక్ష సమయంలో హడావిడి చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించలేమని గుర్తించిన అధికారులు ఇప్పటినుంచే సంసిద్ధం చేసే పనిలో పడ్డారు. ఈ నెల నుంచే ఈ యాక్షన్ప్లాన్ను అమలుచేస్తారు. దీనిలో భాగంగా నెల, సబ్జెక్టుల వారీగా సూక్ష్మ ప్రణాళికలను అమలు చేస్తారు. పాఠ్యాంశాలు, సామర్థ్యాల వారీగా బోధనతో పాటు, అభ్యాస కార్యక్రమాలు ఉంటాయి. పాఠ్యాంశాల బోధనతో పాటు ప్రతి సబ్జెక్టు ప్రాక్టీస్కు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు.
యాక్షన్ ప్లాన్ ఇలా..