హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): గురుకుల టెండర్లలో రూ. 2వేల కోట్లంటూ వస్తున్న కథనాలు అవాస్తవమని బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. కుంభకోణం వార్తలపై ఆమె వివరణ ఇచ్చారు. గురుకుల హాస్టళ్లు, స్కూళ్లు, కాలేజీలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటుతో టెండర్లు నిర్వహించి సరసమైన ధరలకు వస్తువులు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. 28 లక్షల మందికి అవసరమైన స్కూల్బ్యాగ్స్, షూస్, టవల్స్, స్టేషనరీ కిట్స్, 56 లక్షల జతల యూనిఫామ్లు సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు.