హైదరాబాద్ : సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ అభ్యర్థులు మెరిశారు. ఓ ముగ్గురు విద్యార్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది సివిల్స్ పరీక్షకు హాజరైన 16 మందిలో ముగ్గురు విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్వ్యూ కు సెలెక్ట్ అయిన వారిలో వరంగల్ జిల్లా ములుగుకు చెందిన డి ప్రవీణ్ (HT No. 1035114), జనగామకు చెందిన కే ప్రణయ్ కుమార్ (HT No. 1002593) నిజామాబాద్ కు చెందిన డి కిరణ్ కుమార్(HT No. 1014566) ఉన్నారు.
తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో శిక్షణ పొంది సివిల్స్ మెయిన్స్ సాధించి, ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థులను రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు. ఇంటర్వ్యూ లోను ఉత్తీర్ణత సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వెనుక బడిన పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ విద్యార్థులు పలు కాంపిటిషన్ పరీక్షల్లో ప్రతిభ కనబరుస్తున్నారని.. ఇదే ఉత్సా హంతో ప్రతీ ఒక్క ఎస్సీ విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకాంక్షించారు.