నాగర్కర్నూల్ రూరల్, ఫిబ్రవరి 25 : రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, నిర్లక్ష్యం వహించే ప్రభుత్వ అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. బుధవారం నాగర్కర్నూల్ కలెక్టరేట్కు వచ్చిన ఆయన కుమ్మెర బాధిత కుటుంబ సభ్యులను పిలిపించి పరామర్శించారు.
చిన్నారి తల్లిదండ్రులు గణేశ్, మౌనికతోపాటు పలువురు కుటుంబ సభ్యులతో ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.నిందితులకు కఠిన శిక్షలు అమలయ్యే వదలమని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రాంసింగ్ పాటిల్తో సమీక్షించారు. దర్యాప్తును వేగవంతం చేసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.