హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల్లో ఎస్సీ వర్గీకరణపై దాఖలైన పిటిషన్ను త్వరితగతిన విచారించాలని సీజేఐకి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి విజ్ఞప్తి చేసింది. ఈ కేసు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉందని, విచారణకు తీసుకోవడం లేదని సీజేఐ ఎదుట ఎమ్మార్పీఎస్ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మెన్ష న్ చేశారు. సీజేఐ సానుకూలంగా స్పంది స్తూ ఈ పిటిషన్పై విచారణ చేపట్టడానికి త్వరలో సమయం ఇస్తామని హామీ ఇవ్వగా, ఒక తేదీ ఇవ్వాలని రోహత్గీ కోరా రు. అందుకు సీజేఐ అంగీకరించారు.