హైదరాబాద్, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ, బొటానికల్ గార్డెన్కు ఎస్బీఐ గచ్చిబౌలి బ్రాంచి విరాళంగా రెండు గోల్ఫ్ కార్ట్ బ్యాటరీ వాహనాలను బుధవారం అందజేసింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా టీఎస్ఎఫ్డీసీ వైస్ చైర్మన్, ఎండీ చంద్రశేఖర్రెడ్డికి ఎస్బీఐ సైబరాబాద్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కుమార్ రోహిత్, రీజినల్ మేనేజర్ రాజన్ కుమార్ ఆ వాహనాలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు, పెద్దలకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీఐ చీఫ్ సేల్స్ మేనేజర్ ఉమాకాంత్, యోనో హైటెక్ సిటీ, గచ్చిబౌలి బ్రాంచి మేనేజర్ సౌజన్య, రమేశ్, ఈడీ రంజిత్నాయక్, డైరెక్టర్ ఎంజే అక్బర్, ఓఎస్డీ ఎకో టూరిజం తిమ్మారెడ్డి, జీఎం గిలకత్తుల సైలాబ్, డీఎఫ్సీ కిరణ్కుమార్, ఎకో టూరిజం ప్రాజెక్ట్స్ మేనేజర్ సుమన్, ప్లాంటేషన్ మేనేజర్ వీ లక్ష్మిరెడ్డి, డిప్యూటీ ఎఫ్ఆర్వో శ్రీనివాస్రెడ్డి, బోటనిస్ట్ డాక్టర్ వీరకిశోర్, శాంసన్ రాజు తదితరులు పాల్గొన్నారు.