నల్లగొండ: నల్లగొండ జిల్లా అయిటిపాములలో (Aitipamula) భారీ చోరీ జరిగింది. అయిటిపాములలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలో (ATM) దుండగులు నగదు ఎత్తుకెళ్లారు. శనివారం అర్ధరాత్రి దాటినతర్వాత ముసుగులతో ఏటీఎంలోకి చొరబడిన ఆగంతకులు.. గ్యాస్ కట్టర్తో ఏటీఎం మెషిన్ను కట్చేశారు. అనంతరం అందులో ఉన్న రూ.23 లక్షలు ఎత్తుకెళ్లారు.
ఆదివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం.. ఆధారాలు సేకరిస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించేందుకు యత్నిస్తున్నారు.