పాలకవీడు, జనవరి 26 (నమస్తే తెలంగాణ): మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న జాన్పహాడ్ దర్గా ఉర్సులో రెండో రోజైన శుక్రవారం గంధోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ వక్ఫ్ బోర్డు నుంచి తీసుకొచ్చిన గంధాన్ని చందల్ఖానాలో గల గంధంతో కలిపారు. అనంతరం పకీర్ల ఖవ్వాలీ, మేళతాళాల మధ్య మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి గంధం ఎత్తుకొని ఊరేగింపును ప్రారంభించారు. దర్గా ముజావర్ సయ్యద్ జానీ ఇంటి నుంచి గుర్రాలపై గంధాన్ని జాన్పహాడ్ గ్రామంలో ఊరేగించారు. గంధాన్ని తాకేందుకు భక్తులు పోటీ పడ్డారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సైదులు బాబా దర్శనం కోసం బారులుదీరారు.