మహబూబాబాద్, డిసెంబర్ 31 : కష్ట కాలంలో ముందుండే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కురవి దగ్గర రోడ్డుపై ఓ వ్యక్తి గాయాలతో పడి ఉన్నాడు.
బాధితుడిని గమనించిన మంత్రి వెంటనే తన కాన్వాయ్ ఆపి క్షతగాత్రుడిని చేరదీసారు. మంత్రితో పాటు ఆమె కుమారుడు డాక్టర్ సతీష్ రాథోడ్ గాయపడిన వ్యక్తిని పరీక్షించి హాస్పిటల్ తరలించాలని సూచించారు. వెంటనే పోలీస్ వాహనంలో హాస్పిటల్కు పంపించారు.
మంత్రి వైద్యులతో మాట్లాడి బాధితుడికి అత్యవసర వైద్యం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కష్టకాలంలో స్పందించి మంచి మనసును చాటుకున్న మంత్రి పని తీరుకు ప్రశంసలు వెల్లువెత్తాయి.