హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం దేశంలో మార్పు తేవాలన్న అతిపెద్ద ఎజెండాలో భాగమని రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (టీఎస్ రెడ్కో) చైర్మన్ సతీశ్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పేరు మార్పుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ట్విట్టర్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు. ఆహార పదార్థాలు, నగరాలు, ప్రాంతాల పేర్లను మార్చడం బీజేపీ ఎజెండా అని సతీశ్రెడ్డి ట్విట్టర్ ద్వారా విమర్శించారు. దేశంలో ఒక పెద్ద కార్యాన్ని తలపెట్టడం కోసం పేరు మార్చడం టీఆర్ఎస్ ఎజెండా అని తెలిపారు. అయినా పేర్ల మార్పుపై బీజేపీ వ్యాఖ్యానించడం పెద్ద జోక్ అని సతీశ్రెడ్డి పేర్కొన్నారు.