హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు రెండు ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యతా శిబిరాలకు ఎంపికయ్యారు. ఛత్తీస్గఢ్లోని పండిట్ రవిశంకర్ శుక్లా వర్సిటీలో ఈ నెల 21 నుంచి 27 వరకు, జేఎన్టీయూ సుల్తాన్పూర్లో 14 నుంచి 20 వరకు వేర్వేరుగా నిర్వహించే జాతీయ సమైక్యతా శిబిరాలలో వర్సిటీ విద్యార్థులు పాల్గొననున్నారు.
శిబిరాలకు ఎంపికైన ఆకుల సిరి, డీ సింధూజ, ఎస్ దీపిక, సీహెచ్ అచ్యుత, ఆర్ జయప్రకాశ్, సమ్రీన్, సైబజ్, జీ దయాకర్, ఏ వంశీ, నరేశ్ను వీసీ సుంకశాల మల్లేశ్, ప్రోగ్రాం ఆఫీసర్లను అభినందించారు.