హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్స్, హాస్టల్స్ లో పనిచేస్తున్న కేర్ టేకర్, ఏఎన్ఎం, హాస్టల్ వర్కర్ల వేతనాలు పెంచాలని కోరుతూ ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ( PMTA TS) రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ గురువారం సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేశ్కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ వ్యాప్తంగా 194 మోడల్ స్కూల్లో, 168 బాలికల హాస్టల్స్ లో అతి తక్కువ వేతనంతో వీరంతా పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
కేర్ టేకర్, ఏఎన్ఎంలకు రూ.6,700 నుంచి రూ.21వేలు, వాచ్మెన్కు, వంట వారికి రూ.6,700ల నుంచి రూ.15వేల వేతనం పెంచాలని ఆయ కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు, పీఎంటీఏ రాష్ట్ర కన్వీనర్ సయ్యద్ సలీం, రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.